Friday, January 29, 2016

స్వాతంత్ర్యం తరువాత కాంగ్రెస్, కమ్యూనిస్ట్స్ వల్ల దేశానికి జరిగిన నష్టం ఏంటి?


దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కాంగ్రెస్, కమ్యూనిష్టులు మన పాఠ్య పుస్తకాల్లో ఏ ఒక్క దేశభక్తి సంఘటనలు కాని, జాతీయ విప్లవ వీరుల కథలు గాని లేకుండా జాగ్రత్త పడ్డారు.ఈ ఇద్దరూ దేశాన్ని పంచుకున్నారు..పదవులు కాంగ్రెస్ కు..చరిత్ర రచన,పాఠ్యపుస్తకాల యోజన, సాహిత్య అకాడమీలు కమ్యూనిష్టుల కు దక్కింది.

కాంగ్రెస్ పదవుల పిచ్చి తో దేశాన్ని విదేశాలకు తాకట్టు పెట్టారు.ఆంగ్లేయులు వ్రాసిన చరిత్రను, చట్టాలను యథావిధిగా కొనసాగించారు.అంగ్లేయుల పాత్రను కమ్యూనిష్టులు కొనసాగించారు.కమ్యూనిష్టులు రొమిల్లా థాపర్ , ఆర్ సి మజుందార్ వంటి చరిత్రకారులు మన దేశ ప్రజలను ఇంకా బానిసత్వం లో వుంచడానికి చరిత్రను తప్పుగా రూపొందించారు..మన పాఠ్య పుస్తకాల్లో ఏ ఒక్క దేశభక్తి సంఘటనలు కాని, జాతీయ విప్లవ వీరుల కథలు గాని లేకుండా జాగ్రత్త పడ్డారు.ఈ ఇద్దరు చరిత్ర కారుల మార్గం లో మన కొందరు తెలంగాణా మీడియా ఎడిటర్లు మసి పూసి మారెడుకాయ చేస్తున్నారు.ఎందుకంటే ఈ ఎడిటర్లు కమ్యూనిస్టుల మానసపుత్రులు..వీళ్ళు మాత్రమే కాదు... ఇంకా ఎందరో వీళ్ళ శిష్యులు,సమకాలీకులు, తెలంగాణా చరిత్ర ను భారతీయ సంస్కృతి లోఅ భాగం కాదన్నట్లు తాము ఆడింది ఆటగా పాడింది పాటగా ప్రభుత్వం లోని కొన్ని సంస్థలను , యూనివర్సిటీలను, విద్యాసంస్థలను, విద్యా వంతులను, గ్రూప్ కోచింగ్ కేంద్రాలను,విద్యార్థులను,సామాన్య ప్రజలను ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు..


కొన్ని దేశభక్తి ని కలిగించే ముఖ్యమైన విషయాలు నేటి యువతరానికి చెప్పకుండా కావాలని దాచి వుంచుతున్నారు.

1.నేతాజి సుభాష్ చంద్రబోస్ ని వీల్లు హిట్లరు బూట్లు నాకే కుక్క అని గతం లో తిట్టిన వారు..ఆయన సాధించిన గొప్ప విషయాల గురించి చెప్పరు.( బెంగాల్ లొ పుట్టిన సుభాష్,స్వామి వివేకానంద పేరు అక్కడి ప్రజలకు చెప్పకుండా 40 సంవత్సరాల పాటు దేశ ద్రోహులు కమ్యూనిస్టు పాలకులు దాచి వుంచారు రామ క్రిష్ణ మిషన్ సన్యాసులను గ్రామాల్లో కి వెలితే చిత్రహింస పెట్టారు)

2. 1857 స్వాతంత్ర్య యుద్ధం వీళ్ళ దృష్టిలో సిపాయిల తిరుగుబాటు.ఝాన్సిలక్ష్మి,తాంత్యా తోపే గురించి చెప్పరు.వీళ్ళను ఒప్పుకోరు.ఈ చరిత్రను అబద్ధాలు చేసి చెపుతారు.

3.దేశం, దేశభక్తి, భరతమాత అంటేనే వీళ్ళకు ఒళ్ళుమంట..వీళ్ళ కమ్యునిస్టుల డిక్షనరీ లో ఈ కాన్సెప్ట్ కి అర్థాలు లేవు. ఆత్మహత్య చేసుకున్న రోహిత్ ని 'ప్రధాని మోడి' ముద్దు బిడ్డ అన్నందుకే వీరి ఒంటిపై జెర్లు పాకాయి.

4.అంతర్జాతీయ యోగ దినోత్సవం ప్రకటన.. వీళ్ళ గుండెల్లో రైల్లు పరిగెత్తిచ్చింది.ఒక్క ప్రశంసా వాక్యం వీళ్ళ నోట్లొ వినలేదు.ప్రధాని మోడి దేశ విదేశాల్లో ప్రజలను కలిపి వుంచడానికి లక్షలాది భారతీయులతో 'భారత్ మాతా కి జై ' అనిపిస్తుంటే , ఒక్క వ్యాసం,స్టేట్ మెంట్ గాని, డిబేట్ గాని పాసిటివ్ గా లేదు..ఒకరిద్దరు పార్ల మెంట్ సభ్యులు ఉద్వేగంగా మాట్లాడితే రోజుల తరబడి మోడిని తిడుతూ వార్తలు ప్రచురించారు.మోడి ప్రభుత్వం 99 శాతం సరిగ్గ పని చేస్తలేదని మీరు భావిస్తే, కనీసం 1 శాతం చేసిన మంచి పనినైనా సమర్థిస్తు వ్రాసే, చెప్పే ధైర్యం ఈ పత్రికలకు,మేధావులకు లేదు.పాపం రోహిత్ అయినా బహిరంగంగా కాషాయం చూస్తేనే,హిందూ చిహ్నాం కనపడితే చాలు కసి,కక్షతో చింపేస్తాను అని అన్నాడు.ఈ మేధావులు మాత్రం మనస్సుల్లో ఈ ద్వేషాన్ని పెట్టుకుని, విద్యార్తులను,ప్రజలను హిందూ మతం పైన దాడి చేసే తీవ్రవాదులుగా మారుస్తున్నారు.

5.డైరెక్ట్ గా కమ్యూనిస్టులమని చెప్పక రక రకాల బ్యానర్లతో ప్రత్యక్షమై ప్రజా సేవకులుగా అవతారమెత్తే వీళ్ళు, వీళ్ళ ప్రధాన లక్ష్యం హిందుత్వాన్ని,భారతీయ సంస్కృతిని చులకన చేసి ప్రచారం చేయడమే.హిందువులను, హిందూ సంస్థలను అవహేళన చేయడం, మోడి ని లక్ష్యంగా ఎంచుకుని చిన్న చిన్న విషయాలను భూతద్దం లో చూపించి ప్రజలను గందరగోళ పరచడమే వీరి ఉద్దేశ్యం.(ఉదాహరణకు ఆవు మాంసం పై,ఘర్ వాపసీ పై , దాద్రీ సంఘటనల పై, యూనివర్సిటీల్లో బహిరంగ ముద్దులు,బీఫ్ వంటలు,దళిత ముసుగులు మొదలైన చిల్లర విషయాలపై వ్యాసాలు, చర్చలు, సభలు,సంపాదకీయాలు వ్రాస్తారు,చేస్తారు)

6.పేరుకు వీరు పెద్దమనుషులు, మేధావులుగా కనపడినా కూడా హిందు వ్యతిరేక గ్రూపుల్లొ చేరి, నక్సలైట్ తీవ్రవాదులు చేసే అమానుష హత్యాకాండ పై ఒక్క పల్లెత్తుమాట అనరు..అమాయక గిరిజనులు,దళితులు, ప్రజలు,పొలీసులు మొదలైనవారు అమానుషంగా నక్సలైట్ల చేతిలో చచ్చిపోతె, ఒక్క కన్నీటి చుక్క కాదు కదా. సానుభూతి వాక్యం వీళ్ళ చరిత్ర లో ఒక్కటీ కనిపించదు.నక్సలైట్లు చస్తే మాత్రం పేజీలకు పేజీలు నింపి పౌరహక్కులు భంగం అయినట్లు గోల గోల చేస్తారు.

7..ఆర్యులు ఈ దేశం వారు కాదని, బయట నుండి వచ్చారని దొంగ మాటలు ప్రచురించి అబద్ధాలు వ్రాసారు( డా.అంబేద్కర్ స్వయంగా ఋగ్వేదం చదివి 'ఆర్యులు బయటి నుండి వచ్చారనేది ' అబద్ధమని నొక్కి చెపారు.పైగా ఆర్య అనే పదం జాతి శబ్దం కాదని, గుణ వాచకమని కూడా అంబేద్కర్ చెప్పారు) అయినా సరే మన రాష్ట్రం ముఖ్యమైన సంస్థల్లో తిష్ట వేసుకుని పోయిన వీరు అబద్ధాలు చెపుతునే వున్నారు.

8. ముఖ్యమైన పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియా లో వున్నారు( నక్సలైట్లను రాజ్యంగ బద్ధంగా నిషేదించటం తో ఫోర్త్ ఎస్టేట్ అయిన పత్రికల్లో చొరబడ్డారు) భావ వ్యక్తీకరణ పేరుతో,పత్రికా స్వేచ్చ పేరుతో దేశ సంస్కృతి పై, హిందువులపై దాడి చేస్తూ,ప్రధాని మోడి పై బురద చల్లే పనికి శ్రీకారం చుట్టారు.వీళ్ళు ఏది రాసినా చెల్లుతుంది.

9..జర్నలిజం అంటేనే ధార్మిక విషయాల జోలికి పొకుండా, మతాన్ని,ముఖ్యంగా హిందు మతాన్ని,దేవుల్లను, పండుగలను చులకన చేసి వ్రాయటం, కార్టూన్స్ ప్రచురించటం ఒకరిద్దరు స్వాములు చేసిన తప్పుకు సన్యాసి త్యాగ జీవిత పాత్రనే వెక్కిరించటం, భగవద్గీతను అవహేళను చేయటం,ఆయుత చండీ యాగాన్ని విమర్శించటం ఇలా హిందూ మతంపై గురిపెట్టడమే నిజమైన, అసలైన జర్నలిజం గా తీర్చి దిద్దిన గొప్ప మేధావులు వీరు.

10.తెలుగు భాష వేరు,తెలంగాణాభాష వేరు గా తెలివి ప్రదర్శిస్తూ వుండటం, ముస్లింల ఉర్దూ ని కౌగిలించుకుంటాం కాని తెలుగు భాషను ని మాత్రం ముట్టుకోం అనే ద్వేషాని వెలిగక్కటం,(పాకిస్తాన్ లోనె పక్తున్ భాష,పంజాబ్ భాష,సింధీ భాష, బెలుచిభాష మాట్లాడే వారే ఎక్కువ..ఉర్దూ తక్కువ.అలాగే ఉర్దు కాదని బంగ్లాదేశ్ వాల్లు ప్రత్యేక దేశం కోరుకున్నరు కాని ఉర్దూ ని మాత్ర దూరం పెట్టారు).తెలుగు భాష,సంస్కృతం కంటే ఉర్దూ అంటే మహా ఇష్టం..ఈ కమ్యూనిష్టులకు ఉర్దూ పై ప్రేమ కాదు..హిందువులను దెబ్బ తీయాలంటే ఈ భాష మాట్లడే ముస్లిములను హిందువులపై దువ్వాలి కదా..అందుకే ఈ ఎత్తుగడ..

11. మతోన్మాది వికారుద్దిన్ చనిపోతే, అతని తండ్రిని, రోహిత్ చచిపోతే అతని తల్లిని తమ గుప్పిట్లో పెట్టుకుని రాజకీయాలు చేయటం వీళ్ళకు వెన్నతో పెట్టిన విద్య..

12. ఈ దేశ వారసత్వ సంపద మనకు గర్వకారణం...కాని పైన పేర్కొన్న వారు ఎవరు కూడా మన త్యాగ మూర్తులను,దేశభక్తులను,జాతీయ నాయకులను నమ్మరు.

మావో,లెనిన్,మార్క్స్,కాస్ట్రో,చెగువేరా,స్టాలిన్ వీళ్ళకు ఆదర్శమూర్తులు. యాకుబ్ మేమెన్,అఫ్జల్ గురు, కాశ్మీర్ తీవ్ర వాదులు వీళ్ళ దృష్టిలో విప్లవ వీరులు..దేశమొక్కటే కాదు..కుటుంబ వ్యవస్థను, వివాహ వ్యవస్థ పట్ల కూడా నమ్మకం లేని ఈ మేధావులు ప్రస్తుతం మన తెలంగాణా ను ఏలుతున్నరు. తెలంగాణ ప్రజలు బానిసలుగా, ఎవరికీ చెప్పుకోలేక, కుమిలిపోతూ ,తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళ మాట కాదనలేక, బ్రతుకుతున్నరు.రజాకర్ల శారీరిక అత్యాచారాల తరువాత ఇప్పుడు వివిధ ముసుగులు వేసుకున్న ఈ వామపక్ష మేధావుల అత్యాచారాలు మానసికంగా, బుద్ధిపరంగా అంతులేకుండా కొనసాగుతునే వున్నాయి.

ఇవన్నీ అబద్ధమైతే గతం లోని వీళ్ళ వ్యాసాలు చదవండి..ఇప్పుడైనా డైరెక్ట్ గా కనపడ్డ చోట ఈ మేధావులను అడగండి..వివేకనందుడు,భరతమాత,భారతీయ సంస్కృతి, నక్సలైట్ల హత్యా కాండ,భారతీయ కుటుంబ వ్యవస్థ ల గురించి ,భారతీయ వైవాహిక వ్యవస్థ,హిందు ధర్మం విశేషత, హిందు సమాజం లో మహిళ పాత్ర ల గురించి , కాశ్మీర్ భారత దేశం లో అంతర్భాగమా కాదా అని అడగండి.అయితే మౌనం, లేకుంటే వ్యంగ్యం,లేదా ఘోరమైన వ్యాఖ్యలు తప్ప మరేమి వినం.

. ..అబద్ధాలు,అసత్యాలతో ఎంతో కాలం ప్రజలను మభ్యపెట్టలేరని గుర్తించాలి.నెగెటివిటితో ప్రజలను వంచించలేరని కూడా అర్థం చేసుకోవాలి..ఇప్పటికే విద్యావంతులు వీళ్ళు సాగిస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు. నిజమైన చరిత్ర, యువకులను గొప్ప త్యాగమూర్తులుగా తీర్చి దిద్దే భారతీయ విద్య, బానిస మనస్తత్వాన్ని వదలి భారతీయ సంస్కృతి పట్ల అధ్యయనం చేసి, ప్రజలు ఒక గొప్ప దేశంగా మలుచుకునే రోజు ఇంకా ఎంతో దూరం లేదు.
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. కాంగ్రెస్ పదవుల పిచ్చి తో దేశాన్ని విదేశాలకు తాకట్టు పెట్టారు.ఆంగ్లేయులు వ్రాసిన చరిత్రను, చట్టాలను యథావిధిగా కొనసాగించారు.అంగ్లేయుల పాత్రను కమ్యూనిష్టులు కొనసాగించారు.కమ్యూనిష్టులు రొమిల్లా థాపర్ , ఆర్ సి మజుందార్ వంటి చరిత్రకారులు మన దేశ ప్రజలను ఇంకా బానిసత్వం లో వుంచడానికి చరిత్రను తప్పుగా రూపొందించారు..మన పాఠ్య పుస్తకాల్లో ఏ ఒక్క దేశభక్తి సంఘటనలు కాని, జాతీయ విప్లవ వీరుల కథలు గాని లేకుండా జాగ్రత్త పడ్డారు.ఈ ఇద్దరు చరిత్ర కారుల మార్గం లో మన కొందరు తెలంగాణా మీడియా ఎడిటర్లు మసి పూసి మారెడుకాయ చేస్తున్నారు.ఎందుకంటే ఈ ఎడిటర్లు కమ్యూనిస్టుల మానసపుత్రులు..వీళ్ళు మాత్రమే కాదు..కె సి ఆర్ ప్రభుత్వం లో దేశపతి శ్రీనివాస్, అల్లం నారాయణ (నమస్తే తెలంగాణా ఎడిటర్),చక్రపాణి(పబ్లిక్ సర్విస్ కమిషన్), కోదండ రాం,నందిని సిద్ధారెడ్డి, డా.హరగోపాల్, వరవరరావ్,చుక్క రామయ్య,కాకిమాధవ రావ్, టంకషాల అశోక్,కంచ అయిలయ్య,తెలకపల్లి రవి.... ఇంకా ఎందరో వీళ్ళ శిష్యులు,సమకాలీకులు, తెలంగాణా చరిత్ర ను భారతీయ సంస్కృతి లోఅ భాగం కాదన్నట్లు తాము ఆడింది ఆటగా పాడింది పాటగా ప్రభుత్వం లోని కొన్ని సంస్థలను , యూనివర్సిటీలను, విద్యాసంస్థలను, విద్యా వంతులను, గ్రూప్ కోచింగ్ కేంద్రాలను,విద్యార్థులను,సామాన్య ప్రజలను ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు..

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers