• SWAMI VIVEKANANDA

    YOUTH ICON.

  • Dr.B.R.AMBEDKAR

    Father of the INDIAN CONSTITUTION.

  • HAPPY VINAYAKA CHAVITHI

    Ganesh Chaturthi is on August 29 (Ananta Chaturdasi on September 8).

  • SWAMI VIVEKANANDA

    SWAMI VIVEKANANDA

Sunday, January 28, 2018

ఉపన్యాసాలతో కాదు నిరంతర సంబంధాల ద్వారానే సమాజంలో మార్పు వస్తుందన్న ఆశయం తో పనిచేస్తున్న మెదక్ సామాజిక సమరసత వేదిక


మెదక్ సమరసతా కార్యక్రమాలలో ముందు స్థానంలో నిలుస్తుందని చెప్పవచ్చును. పాఠశాల, కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, యాజమాన్యం తో సహా విద్యాసంస్థలు అన్నిటినీ సనరసతా కార్యక్రమం లో భాగస్వాముల ను చేశారు. చుట్టు ప్రక్కల గ్రామాల లో పండుగల సందర్భంగా సామూహిక పూజలు, భోజనాల ఏర్పాట్లు చేసారు. విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. సమరసత సంస్కర్తల వేషాలు విద్యార్థులచే వేయించారు. అన్ని కళాశాల లలో ఉపన్యాస మాలిక నిర్వహించారు. సంత్ రవిదాస్, వాల్మీకి, గురు గోవింద సింగ్, వివేకానంద, అంబేద్కర్ , సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.

బ్యాతోల్, బొల్లారం, కూచన్ పల్లె మొదలైన గ్రామాలలో అంటరానితనం నిర్మూలన కోసం దేవాలయ ప్రవేశం ప్రయత్నాలు చేసి, గృహాలతో సంబంధాలు పెట్టుకున్నారు. రానున్న రోజుల్లో సమరసత నిర్మాణం చేయడానికి పది గ్రామాలు ఎంపిక చేసి, ప్రత్యక్షం ఆచరణ కోసం సంకల్పం తీసుకున్నారు. ఈ విషయంలో మెదక్ ప్రింట్ మీడియా , వేదిక ఆశయ ఆకాంక్షల కనుగుణంగా సహకరిస్తున్నది.
సమరసతా వేదిక ఆధ్వర్యంలో మెదక్ లో శనివారం రాత్రి జరిగిన సమరసత సదస్సులో..కుల వృత్తులు,కుల పెద్దలకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.25 కులాల వారికి ఒకే వేదిక పై సన్మానం నిర్వహించి సమరసతను చాటి చెప్పడం జరిగింది.వివిధ కులాలకు చెందిన వారు మరియు కులాల భాద్యులు 220 మంది పాల్గొని సమరసతను చాటి చెప్పారు.
సామాజిక సమరసత వేదిక పెద్దలు హాజరై మనమంత సమరసతతో ఎలా ఉండాలో మార్గ దర్శనం చేశారు.ఈ సందర్భంగా బొల్లారం, బ్యాతోలు,మెదక్ క నుండి ఎంపిక చేసిన ఆరుగురు నిరు పేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సమరసత వేదిక తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ నరేష్ బాబు గారు,రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యనారాయణ గారు,జిల్లా అధ్యక్షులు రవిగారు,ప్రధాన కార్యదర్శి మశ్చేంద్రనాథ్, ధనరాజు,కార్యదర్సి బైరి నర్సింలు గారు,భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా కోశాధికారి చోళ పవన్ కుమార్ గారు,సాయిబాబా పాల్గొన్నారు.
అప్పాల ప్రసాద్.
















Sunday, January 7, 2018

మెట్‌పల్లి సమరసత సమ్మేళనం లో శ్రీ శ్రీ శ్రీ కమలానంద భారతీ స్వామీజీ ప్రసంగ పాఠం


కులాలు, వర్గాలకతీతంగా సమాజం ఒక్కటైనప్పుడే సామాజికంగా, ఆర్థికంగా,సాంస్కృతికంగా ప్రజలు అభివృద్ధి చెందుతారు. కులం అంటే శాస్త్రం అనీ, కులం అంటే కళ యని, కులం అంటే వృత్తి యని గమనించాలి.కోమట్లు దేశ విదేశాలలో లభించిన ఏ వస్తువునైనా గ్రామాల వరకు అందించే సివిల్ సప్లై వ్యవస్థ చేతబూని నడిపించారు. దేవాలయ వ్యవస్థ లో భేరీలు,ఢక్కాలు,శబ్దం చేసే పరికరాలు, మంచినీటి సరఫరా చేయడానికి కావలసిన తోలు తిత్తులు మొదలైనవి,అలాగే తిరుపతి లో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే ముందు దర్శించే చెప్పులు ఇవన్నీ మాదిగలు తయారు చేెసిచ్చినవే.మాతంగ ఆశ్రమం లో (మాదిగ కన్యగా) జన్మించి, తప:సంపన్నుడైన వశిష్ఠుడికి అనుకూలవతి భార్య గా పతివ్రత గా పేరుపొందిన అరుంధతి లభిస్తే రామ,లక్ష్మణ, భరత,శత్రుఘ్నులు ఈ నలుగురికి 7సంవత్సరాలు అన్నంపెట్టి పెంచిన మహా సాధ్వి అరుంధతి.ఆమె జననము మాతంగి మహర్షి ఆశ్రమంలోనే జరిగింది‌.ఆమె నక్షత్రమై ఆకాశములో వుంటే, వివాహ వేళలొ ,నూతన దంపతులకు ఆ నక్షత్రమే చూపించి, దండం పెట్టిస్తారు.




ముదిరాజ్ లు దేశంలో పండించిన పండ్ల ను ప్రజలకు అందించిన వారు. ఉప్పెరలు, వడ్డరలు కాకతీయుల కాలం నుండి చెరువులు, బావులు త్రవ్విన, రోడ్లు వేసిన నిపుణులు. అలాగే ఎవరింట్లో వివాహం జరిగినా, వధూవరులు మొదట బట్టలు కొన్నప్పుడు ' తల్లి చీర' పేరుతో ఇంటికి సేవ చేసే చాకలికి ఆ చీర కొని అందించే అలవాటు ఉంది. కమ్మరి, కుమ్మరి, ఔసలి, వడ్రంగి, శిల్పాలు చెక్కే వారందరికీ విశ్వకర్మ ఇలవేలుపు గా చేసికుని, విశ్వబ్రాహ్మణులు అయ్యారు. ఆదిలాబాదు లో రంజనులు తయారు చేసే కుమ్మరి ఆయా ప్రాంతాలకు తగినట్లుగా రంజన్ లు తయారు చేస్తే , రాష్ట్రం అంతా కొనుక్కోవడానికి వచ్చేవారు. దేవుని పూజకు కావలసిన బుక్కాగులాలు (రంగులు)చేసేవారికి పుష్కలంగా డిమాండ్ వుంది. మంగలి ఫిజియోథెరపీ లో ప్రావీణ్యం కలిగినవారు. ప్లాస్టిక్ సర్జరీ లో అత్యంత నిపుణులు. అద్భుతమైన చేనేత కళా నైపుణ్యానికి ఉదాహరణ పద్మశాలి కులస్థులు. వీరి నేసిన బట్టలు ముంబాయి నుండి నారాయణ పేట కు వచ్చి వస్త్రాలు కొనుక్కుని వెళ్లేవారు. బ్రాహ్మణులు గర్భగుడిలో యజుర్వేద మంత్రాలు చదువుతూ ఉంటే, నాయీ బ్రాహ్మణులు తమ నాద స్వరాలతో సామవేద గానం వినిపించారు. బ్రాహ్మణులు వ్యవసాయ రంగంలో కూడా అనుభవం గలవారు.అటు వ్యవసాయం , ఇటు పౌరోహిత్యం కూడా చేస్తూ వచ్చారు. మాలలు all rounders. మాలలు అన్నిపనులను చేయడం లో నిష్ణాతులు. అన్ని వృత్తుల వారు చేయగలిగే పనులన్నీ చేసేవారు. ఈ విధంగా మనిషి ఒక సంఘజీవిగా ఒక గ్రామంలో పరస్పరం ఇచ్చి పుచ్చుకొనే వ్యవహారాల తో గ్రామాలు విలసిల్లినవి.

కాలక్రమేణా ఆంగ్లేయుల కాలంలో రైతులపై అధిక పన్నులు విధించి, చేనేతకార్మికుల చేతివ్రేల్లు నరికి, అన్ని రకాల చేతివృత్తుల వారిని ఆంగ్లేయులు దెబ్బతీసారు. గ్రామీణ వ్యవస్థ ను నాశనం చేశారు.పెరిక కులస్థులు విత్తన అభివృద్ధి లో ప్రధాన పాత్ర పోషించారు. వృక్ష శాస్త్రం గురించి అవగాహన కలిగిన వారు. గౌడ కులస్తులు శ్రమ జీవుల కోసం ఈత కల్లు, తాటి కల్లు ( ఇప్పుడు క్లోరోఫామ్, డైజో ఫామ్ వంటివి కలపటం తొ ప్రజల ఆరోగ్యాలు నాశనం అవుతున్నాయి) తో ప్రజల అనారోగ్యం నివారణ జరిగేది. యాదవులు పాల ఉత్పత్తి లో అందెవేసిన చెయ్యి.అలాగే జంతుశాస్త్రం లో ప్రతిభావంతులు.
(జనవరి 7 ఆదివారంనాడు వాసవి గార్డెన్స్ లో జరిగిన మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండల ప్రజలు సుమారు 400 పాల్గొన్నారు. 20 గ్రామాలనుండి అన్ని వర్గాల ప్రజలు రాగా, అందులో 150 మంది ఎస్ సి బంధువులు మిగతా 250 మంది అన్ని కులాల వారు హాజరయ్యారు. 100 మహిళలు వచ్చారు.)
సన్మానం:


ఎస్ సి లని కూడగట్టుకుని కుస్తాపూర్ గ్రామంలో శివాలయం నిర్మాణానికి ముందు నిలిచిన గంగమ్మ ను, గోధూరు గ్రామంలో రామాలయం మాల పూజారి సత్తయ్య, వెల్లుల్ల గ్రామంలోని అక్కగొండ నరసింహ స్వామి ఆలయం పూజారి గంగయ్య , కోరుట్ల ప్రక్కన కట్లకుంట గ్రామంలో ప్రతి ఉదయం 8 గంటలకు జనగణమన జాతీయ గీతం నిర్వహణ ద్వారా ప్రజలలో దేశ సమైక్యత కు కృషి చేస్తున్న అహ్మద్, రాజేందర్, పంచాంగం అలాగే గీతాపారాయణ ద్వారా ప్రజలలో ఆధ్యాత్మిక భావనలు నిర్మిస్తున్న మాదిగ వంశస్థులు లక్ష్మీ నారాయణ,94 సంవత్సరాల వయస్సులో యోగ నేర్పుతున్న బాలయ్య మొదలైన వారికి స్వామీజీ శాలువా తో సత్కరించారు.
మెట్లచిట్టాపూర్ సర్పంచ్, సమరసత వేదిక జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షులు రాజేందర్ రెడ్డి నిర్వహణ లో కార్యకర్తలు పనిచేసి సమ్మేళనం విజయవంతం చేశారు. జగిత్యాల జిల్లా అధ్యక్షులు వెంకటరమణారెడ్డి , కార్యదర్శి గంగాధర్, బండ లింగాపూర్ అంబేద్కర్ సంఘం నాయకులు తుకారాం పాల్గొన్నారు. నిరంజన్ సభా కార్యక్రమం నిర్వహించారు. మెట్‌పల్లి సర్కిల్ ఇన్ స్పెక్టర్ రవీందర్ రెడ్డి కూడా ప్రసంగించారు. నేరెళ్ల గ్రామ ఎమ్ పిటిసి ఇంద్రాల మల్లేశం, మెట్‌పల్లి మండల అధ్యక్షుడు గోపి మాట్లాడారు.

Thursday, January 4, 2018

ఖమ్మం జిల్లా బోనకల్ మండలకేంద్రంలో సామాజిక సమరసతా సమ్మేళనం

ఖమ్మం జిల్లా బోనకల్ మండలకేంద్రంలో సామాజిక సమరసతా సమ్మేళనం జనవరి 3 , బుధవారం సాయంత్రం 6 గంటలకు శివాలయం ప్రాంగణంలో ఘనంగా జరిగింది.

కమ్యూనిస్టుల కంచుకోటగా భావించే ఈ గ్రామంలో 180 మంది అయ్యప్ప స్వాములతో , 10 గ్రామాల నుండి వచ్చిన 100 మంది భజన భక్తులతో , బోనకల్ గ్రామంలో ని అన్ని వర్గాలకు చెందిన సుమారు 600 మంది ప్రజలతో అత్యంత ఆధ్యాత్మిక వాతావరణంలో కార్యక్రమం నిర్వహించబడింది.
పాఠశాల విద్యార్థినీ విద్యార్థులతో "దేశం మనదే" పాట పై నృత్యం చేశారు. 'అందరు కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడా మాధవుడు', ' నంద లాలా యదు నంద లాలా' , 'లింగనికి, రంగనికి భేదమా' వంటి భజన గీతాలతో , 'కొడుకా నన్ను కోతాకమ్మకురా' అనే గోమాత వేదనా గీతం తో ప్రజలు తన్మయత్వంతో, ఉద్వేగం తో హిందుత్వ భావనకు లోనయ్యారు.



లెక్చరర్ రంగారావు, అధ్యక్షతన ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఇన్ స్పెక్టర్ జనరల్ శంకర్‌ రావు, జెడ్పిటిసి కొండా (సిపిఎం నాయకుడు), సమరసతా రాష్ట్ర కార్యదర్శి జయపాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి రాజా రావు, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర రావు, శివాలయం దేవాలయం సమితి అధ్యక్షులు తిరుపతయ్య, కర్లపూడి లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు.


సామాజిక కార్యకర్త రాఘవ మరియు ఆయన మిత్రులు ఈ కార్యక్రమం భుజాన వేసుకొని, సుమారు 200 గృహాలు సంపర్కం చేసారు. ఫలితంగా ఎక్కువ సంఖ్య లో కుటుంబాలు తరలివచ్చాయి.


సుమారు 18 కుల వృత్తుల వారికి, అయ్యప్ప గురుస్వాములకు, తిరుపతయ్య గురు స్వాములకు, విద్యా, వైద్య, భజన రంగాలలో సేవలు చేస్తున్న వారికి ఈ సందర్భంగా శాలువ, స్వామి వివేకానంద చిత్రం అందించి సత్కరించారు. ఆ తరువాత సామూహిక భోజనాలు నిర్వహించారు.

స్వామి వివేకానంద, అంబేద్కర్, సంత్ సేవాలాల్, కొమరమ్ భీమ్ వంటి మహనీయుల అడుగుజాడల్లో కుల వివక్షత, అంటరానితనాన్ని నిర్మూలించి, అందరిలోనూ భగవంతుడు వున్నాడన్న భావనతో మనిషిని మనిషి సద్భావనలతో గౌరవించే మానవత్వం అలవరుచుకోవాలని అతిథులు తమ ప్రసంగాల్లో కోరారు.




    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers