Tuesday, March 1, 2016

దేశం తో యుద్ధం ..ప్రొఫెసర్ల వ్యూహాలు..దళిత విద్యార్థులే పావులు

దేశం తో యుద్ధం ..ప్రొఫెసర్ల వ్యూహాలు..దళిత విద్యార్థులే పావులు ..

అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడితేనే ఆస్తి మనకొస్తుంది.

హిందూ,ముస్లిం ల మధ్య కొట్లాట పెడితేనే కదా దేశం బ్రిటిష్ స్వంతమైంది.

ఎస్ సిల కు, ఇతర కులాలు కలవకుండా ద్వేషం వెలికక్కితేనే సమాజం ముక్కలై మిషనరీల,జిహాదీల,కమ్యూనిష్టులకు అధికార లక్ష్యంనెరవేరుతుంది.

సెంట్రల్ యూనివర్సిటీ లో రోహిత్ రాజీ కుదుర్చుకుందామని వేడుకున్నా, సాగనివ్వలేదు.

రోహిత్ కుటుంబానికి 8 లక్షలు ఇస్తామన్నా,వద్దని,వివిధ రాజకీయ పక్షాల నుండి డబ్బులు తీసుకుని యాత్రలు చేపెట్టి ద్వేషాలు పెంచుతున్నారు.

రోహిత్ అమ్మను కేరళ లో ముస్లిం లీగ్ నాయకుడు మునీర్ ఇంటికి(ఫిబ్రవరి 11న) పంపి,జిహాద్ సంస్థ లతో చేతులు కలిపి యుద్ధానికి సిద్ధమవుతున్నారు. రోహిత్ చట్టం పేరుతో అన్ని విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులను చీల్చి,విషబీజాలు నాటే కుట్ర కు కంచ ఐలయ్య, కాకి మాధవ రావ్ ఎప్పుడో శ్రీకారం చుట్టారు.

కెంద్ర మంత్రి లేఖ వ్రాస్తేనేమో యూనివర్సిటి లో జోక్యం చేసుకున్నట్లు...మరి...రాహుల్ గాంధి ని పిలిచి నిమ్మకాయ నీళ్ళు తాపితే అది జొక్యం కాకుండా అది సంఘీ భావం తెలిపినట్లా?

ప్రొ. డా.హరగొపాల్ తన 30 ఏళ్ళ యూనివర్సిటీ ఉద్యోగ జీవితంలో 8 మంది కి పైగా దళితులు,ఇతర కులాలు ఆత్మహత్యలకు గురయ్యారు. ప్రొ.డా హరగొపాల్ గారి ఇద్దరు కుమార రత్నాలు బాగా చదివి ప్రొఫెసర్లు అయితే ఆయన వ్యాసాలు చదివి, ఆయన ఉపన్యాసాలు విన్న దళితులు మాత్రం చదువులు మానేసి,బుర్రలు చెడగొట్టుకుని,భవిష్యత్తు కోల్పోయి ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఎందుకు నక్సలైట్లుగా మారి ఎన్ కౌంటర్లో చస్తున్నారు? అంటూ తోటి ప్రొఫెసర్లు ప్రశ్నిస్తున్నారు. దళితులకో నీతి, తన కొడుకలకో నీతి వుంటుందా?బ్రాహ్మనిజం అంటూ గొంతు చించుకునే వాళ్ళకు డా హరగోపాల్ లో వున్న బ్రాహ్మనిజం ఎందుకు కనిపించటం లేదో? అర్థం కాదు. అతనితో పాటు విప్లవభావాలు నూరిపోసె ఇంకొక ప్రొఫెసర్ కూడా ఈయన లాగే తన కొడుకు ను అందలమెక్కించి,దళితులను అడవులకు ఎందుకు పంపించి బలి తీసుకుంటున్నారో ? అని ఆయన దగ్గరున్న వ్యక్తులే బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు..

గమ్మత్తేమిటంటే కంచ ఐలయ్య దళితుడు కాదు.డా హర గోపల్ దళితుడు కాదు.కాకి మాధవ రావ్ తాను విశ్రాంత ఐ ఏ ఎస్,తన కుటుంబంలో సుమారు 10 పైగా ఐ ఏ ఎస్ లు వున్నారు.అందరూ లక్షాధి కారులే . దలితుడు ఎలా అవుతాడని అందరి అనుమానం? ఎవరు ఎవరికి నాయకత్వం వహించి...ఎవరు ఎవరిని చంపిస్తున్నారొ? గుర్తిస్తే మంచిది.
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. దేశం తో యుద్ధం ..ప్రొఫెసర్ల వ్యూహాలు..దళిత విద్యార్థులే పావులు ..



    అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడితేనే ఆస్తి మనకొస్తుంది.


    హిందూ,ముస్లిం ల మధ్య కొట్లాట పెడితేనే కదా దేశం బ్రిటిష్ స్వంతమైంది.


    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers