Monday, April 11, 2016

బౌద్ధం లోకి ప్రవేశం


డా అంబేద్కర్ హిందూ సమాజానికి ఒక షాక్ ఇవ్వాలనుకుని 1935 లో ఒక ప్రకటన చేస్తూ తాను హిందూ మతం లో పుట్టినా, ఈ మతం లో చావనని అన్నాడు..

ఆయన గురువైన గాడ్గే బాబా వద్దకి వెళ్ళి ఆయన అభిప్రాయం చెప్పమని అంబేద్కర్ అడిగాడు..నాకు చదువు పెద్దగా రాదని, నీవేమో బాగ చదువుకున్నవాడివి ..నేనేమి చెప్పగలను అంటూనే...హిందూ ధర్మానికి హాని కలగకుండా ఏదీనా చేయమని సలహా ఇచ్చాడు.

బాబూ జగజీవన్ రాం, అంబేద్కర్ ని మతం మారవద్దని సూచన చేశాడు.

ఆర్ ఎస్ ఎస్ పూర్తి సమయ కార్యకర్త దత్తోపంత్ ఠెంగ్డి తన బాధ వ్యక్తం చేశారు.

హైదరాబాద్ నుండి భాగ్యరెడ్డి వర్మ ద్వార వెళ్ళిన వెంకట్రావ్ అంబేద్కర్ ని కలిసి హిందూ మతం వీడొద్దని చెప్పాడు.

అంగ్లేయులు, ఆర్చ్ బిషప్ లు అంబేద్కర్ ని కలిసి క్రైస్తవం లో చేరాలని, ఆంగ్ల ప్రభుత్వం లో ఉన్నత పదవులు ఇస్తామని ప్రలోభపరిచారు.

నిజాం నవాబ్ కోట్ల రూపాయలు ఆశ చూపి ముస్లిం మతం లొ చేరి, హిందువులపై పగ తీర్చుకుందామని వివరించారు.

ఇవన్నీ విన్నాడు..గమ్మత్తేమిటంటే 1935 లో ప్రకటించి, సుమారు 21 సంవత్సరాలు వేచి చూశాడు డా.అంబేద్కర్.ఆ తరువాత అక్టోబర్ 14,1956 లో బౌద్ధాన్ని స్వీకరించారు.

21 సంవత్సరాలు ఎందుకు ఎదురు చూసారు.?1956 సంవత్సరాన్నే ఎందుకు ఎంపిక చేసుకున్నారు?

ఇన్ని సంవత్సరాల తరువత కూడా హిందూ సమాజ పెద్దల్లో చెపుకో తగిన మార్పు రాలేదు..తనకేమో వృద్ధాప్యం వచ్చెసింది..అంతేనా? ప్రపంచమంత విస్తరిస్తున్న కమ్యూనిజం భారత్ లో తన పంజా విప్పింది.కమ్యూనిజపు విషపు కౌగిట్లోకి పోకుండా, హింసాత్మక చర్యలకు పాల్పడే కమ్యూనిష్టుల పంచన చేరకుండా తన తోటి ప్రజలు శాంతి, దయ, ప్రేమ లను అందించే బుద్ధమతమె సరియైనదని భావించారు.తన అనుచరులకు , ముఖ్యంగా గాంధిజి కి ఉత్తరం వ్రాస్తూ , హిందూ సమాజానికి తక్కువ నష్టం కలిగే విధంగా , అలాగే హిందు భూమిలొ ఒక భాగమైన బౌధం లో చేరుతానని ప్రకటించాడు.విదేశీ భావజాలాల క్రైస్తవం, ఇస్లాం తన వారికి ఆమొద యొగ్యం కాదని తెలియ చేశాడు.

అంతే కాని హిందూ సంస్కృతిపైన విష విద్వేషాలు వెలిగక్కలేదు..

(డా అంబేద్కర్ హిందు మతం వదలిపెట్టాడు. కాబట్టి,ఇప్పటి హిందు సమాజం లో వస్తున్న మార్పులను చూసి కూడా, కేవలం హిందూ ధర్మానికి నష్టం వాటిల్ల చేయాలన్న అలోచనతో మాత్రమే, దళితులను ఎటూ చేసి, హిందు మతాన్నుండి దూరం చేసి, క్రైస్తవం లోకొ( కంచ ఐలయ్య ప్రయత్నం),హిందువులతో కొట్లాటలకు కొత్త బౌద్ధం లోకో (మల్లెపల్లి లక్షమయ్య ప్రయత్నం),కమ్యూనిస్టుల్లోకి చేర్పించే ఆ పార్టిల ప్రయత్నం, హిందూ దేవీ దేవతల కు పూజ చేయకుండా,పండుగలు జరుపకుండా ఐ పి ఎస్ ప్రవీన్ కుమారు ప్రయత్నం, నక్సలైట్ల హింసా ధొరణిలోకి రావటం లో డా. హరగోపాల్ ప్రయత్నం, ఇలా అంబేద్కర్ పేరు చెప్పి దళితులను గందర గోళ పరిచి, వాళ్ళను బలి పశువులను చేసి ఆడుకుంటున్న తీరు తెలంగాణా లో అందరికి కొట్ట వచ్చినట్లు కనపడుతున్నది..వీళ్ళ చర్యల వళ్ళ, దళితుల అభివృద్ధి పక్కన పెడితే ఈ నాయకుల స్వార్థ రాజకీయాలకు మాత్రం తప్పక ఉపయోగపడుతుంది.)
- అప్పాల ప్రసాద్.

2 comments:

  1. డా అంబేద్కర్ హిందూ సమాజానికి ఒక షాక్ ఇవ్వాలనుకుని 1935 లో ఒక ప్రకటన చేస్తూ తాను హిందూ మతం లో పుట్టినా, ఈ మతం లో చావనని అన్నాడు.

    ReplyDelete
  2. అదేం కాదండీ ఎవరెన్ని చెప్పినా ఎవరో బలహీనులు తప్ప అందరూ అందరి ప్రభావంలోకి వెళ్ళరు. జీవిక కోసం వెళతారు. సంఖ్య చూడకండి సామర్థ్యం చూస్తే ఎవరు మతం మార్చుకున్నా సనాతన ధర్మ మూలాలు ఎన్నటికీ చెడవు. కొంచమైనా మిగిలే ఉంటాయి. ఐతే వాళ్ళ వాళ్ళ బుద్ధులు తెలుస్తాయి. మార్చాలి అనుకునేవారు పరమ అవకాశవాదులు. ఏదో చేసి నలుగురి నోళ్ళల్లో నానాలని తాపత్రయం.

    ReplyDelete

    స్వామి వివేకానంద వీడియో పాటలు

    సంప్రదించు

    Name

    Email *

    Message *

    స్వామి వివేకానంద పాటలు

    Followers